నగరిలో గాయత్రి దేవి అలంకరణలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు

65చూసినవారు
నగరిలో గాయత్రి దేవి అలంకరణలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు
నగరి కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం రెండవ రోజులో భాగంగా గాయత్రి దేవి అలంకరణ భక్తులకు మహదానందాన్ని ఇచ్చింది. ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రూపేష్ క్రిష్ణ ఆచార్యులు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం కర్పూర నీరాజనం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ తెలిపింది.

సంబంధిత పోస్ట్