కమ్మనపల్లెలో రక్తనమూనాల సేకరణ

85చూసినవారు
కమ్మనపల్లెలో రక్తనమూనాల సేకరణ
దోమ కాటుతో మలేరియా, డెంగీ వంటి జ్వరాలు వ్యాప్తి చెందుతాయని మలేరియా సబ్ యూనిట్ అధికారి జయశంకర్ అన్నారు. బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లెలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేశారు. అనుమానితుల రక్త నమూనాలు సేకరించారు. మురుగు కాలువల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేశారు. కేజిబివి మోడల్ స్కూల్ను సందర్శించి అతిసారాపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్