మద్దెలచెరువు పాలెంలో క్షేత్ర దినోత్సవం

84చూసినవారు
మద్దెలచెరువు పాలెంలో క్షేత్ర దినోత్సవం
పీలేరు మండలం, ముడుపులువేములగ్రామం, మద్దెలచెరువుపాలెంలో వేరుశనగ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ క్షేత్ర దినోత్సవానికి జిల్లా వ్యవసాయ అధికారి బి. చంద్రా నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి డి. ఆర్. సి ఏఓ సుచిత్ర, పీలేరు డివిజన్ ఏడిఏ వైవి రమణ రావు, ఎక్స్టర్నల్ ఇన్స్పెక్టర్ రవి, ఏఓ రమాదేవి, టిఏ కరుణాకర్ రెడ్డి, ఏఈవోలు నజీర్, ఇంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్