వరసిద్ధుడి సేవలో పూతలపట్టు ఎమ్మెల్యే

50చూసినవారు
వరసిద్ధుడి సేవలో పూతలపట్టు ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఈవో వెంకటేశు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్