పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్

76చూసినవారు
పుంగనూరు పట్టణంలో అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అబ్జర్వర్ కవిత మన్నెకిరి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్