పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం పెద్ద కొండ మర్రి పంచాయతీ నాగిరెడ్డి గారి పల్లి , కోటూరు తదితర గ్రామాలలో మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ముమ్మరంగా స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ రానున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.