పుంగనూరులో అస్పియా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ

62చూసినవారు
చిత్తూరు జిల్లా , పుంగనూరు పట్టణంలో ఇటీవల మృతి చెందిన చిన్నారి అస్పియా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి శనివారం పట్టణానికి చేరుకున్నారు. వారికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు.

సంబంధిత పోస్ట్