చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కుమ్మరి వీధి, బజార్ వీధి, సెంట్రల్ లాడ్జ్, సుబేదార్ విధి తదితర ప్రాంతాలలో బుధవారం రాత్రి సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ మరియు పార్లిమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహించామని తెలిపారు.