అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే కేసు నమోదు చేస్తాం

69చూసినవారు
అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే కేసు నమోదు చేస్తాం
సత్యవేడు ప్రాంతంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తే కేసులు నమోదు చేస్తామని స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రామస్వామి స్పష్టం చేశారు. ప్రధానంగా గంగ గట్టు మట్టి తరలిపోకుండా రాత్రి వేళలో పోలీసులు బీటు నిర్వహించడంతోపాటు పెట్రోలింగ్ కూడా ఉంటుందన్నారు. దీంతోపాటు గంగ మట్టి అక్రమ తరలింపుకు సంబంధించి తెలుగు గంగ సిబ్బంది కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్