ఎమ్మెల్యే కిలివేటి ర్యాలీలో భగ్గుమన్న వైకాపా నేతల విభేదాలు

75చూసినవారు
సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గురువారం సూళ్లూరుపేట ఆర్. వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ప్రచారం రథంపైనే వైకాపా నేతల వర్గ పోరు భగ్గుమంది. ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు కళత్తూరు శేఖర్ రెడ్డిలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. ఎమ్మెల్యే కిలివేటి సర్ది చెప్పి, పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్