ఆటో అదుపుతప్పి బోల్తా.. పలువురికి గాయాలు

81చూసినవారు
ఆటో అదుపుతప్పి బోల్తా.. పలువురికి గాయాలు
కురబలకోట మండలంలో గురువారం ఆటో బోల్తా పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తెట్టు గ్రామం ఆరోగ్యపురానికి చెందిన కుమార్ ఆటోలో అదే ఊరికి చెందిన కూలీలు రెడ్డప్ప, రాజమ్మ, సులోచన, అమరావతి, సుబ్బమ్మ, రమణయ్య, మరి కొందరు చెన్నామర్రికి బయలుదేరారు. దిగువపాలెం కోట వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్