మమ్మురంగా మంచినీటి పైప్ లైన్ మరమ్మతులు

76చూసినవారు
తంబళ్లపల్లె మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహానికి వెళ్లే మంచినీటి పైప్ లైన్ దెబ్బతింది. దీంతో హాస్టల్ విద్యార్థులకు నీటి సమస్య ఏర్పడింది. హాస్టల్ వార్డెన్ సమస్యను సర్పంచి నీలూఫర్ మైనుద్దీన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సర్పంచి మంగళవారం జేసీబీ సాయంతో పైప్ లైన్ మరమ్మతులు చేపట్టారు. పైప్ లైన్ ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రాత్రి వేళలో మరమ్మతులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్