రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్, ఓ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని ఎంపీయూపీ స్కూల్లో ఓటేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి పట్టభద్రుల ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.