సీఎం జగన్ జనవరి 3వ తేదీన కాకినాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. అలాగే దశలవారీగా పింఛన్ సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్న రూ.2750 నుంచి రూ.3,000కు పెంచే కార్యక్రమాన్ని కాకినాడలో సీఎం ప్రారంభిస్తారని తెలిపారు.