విశాఖపట్నంలో కరోనా కలకలం రేపింది. కీళ్లవాపు వ్యాధితో బాధపడుతున్న 14 ఏళ్ల బాలుడు.. కేజీహెచ్లో చేరాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సదరు బాలుడు మృతిచెందాడు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. కాగా, బాలుడి కుటుంబ సభ్యులు, దగ్గర బంధువుల నుంచి నమూనాలు సేకరించినట్లు వైద్యులు తెలిపారు.