AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్లో గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.