కూటమిలో విభేదాలు.. పరిటాల క్లారిటీ

67చూసినవారు
కూటమిలో విభేదాలు.. పరిటాల క్లారిటీ
కూటమి ప్రభుత్వంలో విభేదాలు లేవని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. మంత్రి సత్యకుమార్‌ను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంపై ఆదివారం ఆయన క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌పై కేడర్ అసహనంగా ఉండటం వల్లే నిరసనకు దిగారని చెప్పారు. దీనిపై సత్యకుమార్‌తో చర్చించామని వెల్లడించారు. కూటమి నేతలు కలిసికట్టుగానే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్