ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ నేతల్లో అసంతృప్తి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్కు, సీనియర్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర అధిపత్య పోరు నడుస్తోందని సమాచారం. అంతే కాకుండా మంత్రితో కార్యకర్తలు సైతం దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.