ఏపీలో పట్టాదారు పాసు పుస్తకాల నిలిపివేత

59చూసినవారు
ఏపీలో పట్టాదారు పాసు పుస్తకాల నిలిపివేత
రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ కోసం గత సర్కారు ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను నిలిపివేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 20 లక్షల మంది రైతులకు పుస్తకాలు అందాల్సి ఉండగా ఎన్నికల వల్ల వేలాదిమందికి అవి రాలేదు. మాజీ సీఎం జగన్ ఫోటో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రీ-సర్వే కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్