సీఎం జగన్ ప్రోత్సాహంతోనే నగరాన్ని అభివృద్ధి చేయగలిగానని ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని స్థానిక 34, 40వ వార్డులలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతోనే సమ సమాజస్థాపన సాధ్యమని నమ్మిన జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు.