కోరుకొండలోని బూరుగుపూడి సమావేశంలో కూటమి పొత్తులోని డొల్లతనం బయట పడిందని ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు. మంగళవారం రాజమండ్రిలో ఎంపీ మాట్లాడుతూ ఫ్లెక్సీలో టీడీపీకి చెందిన ఓ నేత ఫొటో లేదని ఆయన అనుచరులు ఆందోళన చేశారని, దాంతో ఆ మీటింగే రద్దయినట్లు వార్తల్లో చూశానన్నారు. ఇదేనా కూటమి, ఇదేనా మిత్రుల మధ్య ఐక్యత అని భరత్ ప్రశ్నించారు. ఈ కూటమికి పొరపాటున అధికారం అప్పగిస్తే రాష్ట్రం అతుకుల బొంతలా మారుతుందన్నారు.