సీఎం జగన్ బీసీల ద్రోహి అని, వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ఆరోపణలు చేశారు. జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా బీసీ వాహనాలను సోమవారం రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల టీడీపీ నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన బీసీలను వైసీపీ వేధింపులకు గురి చేసిందన్నారు.