మే 13వ తేదీన తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామని గోకవరం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. గురువారం జగ్గంపేట నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ తోట నరసింహం తెలుగుదేశం పార్టీలో చేరేవారు నిజమైన వైసీపీ కార్యకర్తలు కాదని విమర్శించడంతో టిడిపి నాయకులు గాజింగంసత్తిబాబు, దాసరి సతీష్ , పెద్దాడవెంకన్నదొర, బదిరెడ్డి బాబి మాట్లాడుతూ తాము నిజమైన టిడిపి కార్యకర్తలమని టిడిపిలో చేరేవారు వైసిపి కి చెందిన వారేనని తెలిపారు.