అమలాపురం మండలం రెడ్డిపల్లిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు అమలాపురం వెంకటేశ్వర డిగ్రీ కళాశాల సాయం అందించారు. రూ.15 వేల విలువైన కిరాణా, వంట సామగ్రి, కాయకూరలు, నిత్యావసర వస్తువులు, నూతన వస్త్రాలు, నగదు శుక్రవారం అందించారు. కళాశాల కరస్పాండెంట్ నరసింహారావు, ప్రిన్సిపాల్ మనోహర్, ఏవో ప్రవీణ్ ఉన్నారు.