అమలాపురం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని జనసేన సీనియర్ నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు పార్టీ శ్రేణులకు బుధవారం పిలుపునిచ్చారు. అమలాపురంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కష్టపడిన వారికి జనసేన నుంచి పదవులు వస్తాయన్నారు.