ఎన్నికల సంఘం, కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఆదివారం అల్లవరం మండలంలోని 23 సచివాలయాల పరిధిలోని వాలంటీర్స్ బయోమెట్రిక్ పరికరాలను అధికారులకు అప్పగించారు. మొత్తం 261 మొబైల్స్, 197 బయోమెట్రిక్ పరికరాలను పంచాయతీ సెక్రెటరీలు, సచివాలయ సిబ్బంది తీసుకున్నారు. వాటిని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో భద్రపరిచినట్లు ఎంపీడీవో కృష్ణ మోహన్ తెలిపారు.