బలబద్రపురంలో మహిళ దారుణ హత్య

85చూసినవారు
ఓ మహిళ తలపై ఇటుకతో కొట్టి హత్య చేసిన ఘటన బిక్కవోలు మండలం బలబద్రపురంలో బుధవారం చోటుచేసుకుంది. బలబద్రపురానికి చెందిన సునీల్ కు అతని చిన్నాన్న గంగరాజుకు గొడవ జరిగింది. దీంతో సునీల్ తల్లి, బుజ్జి(40) గంగరాజును నిలదీయడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో పక్కనే ఉన్న ఓ ఇటుకతో గంగరాజు, బుజ్జి తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్