బిజెపిలో పలువురు యువకులు చేరిక

70చూసినవారు
అనపర్తి మండలం పీరారామచంద్రపురంలో సోమవారం పలువురు వైసీపీ కార్యకర్తలు బీజేపీలో చేరారు. పీరారామచంద్రపురానికి చెందిన కర్రి బుల్లిరెడ్డి, శ్రీనివాసరావుతో సహా పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి బీజేపీ ఉపాధ్యక్షురాలు పురందీశ్వరి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్