చంద్రబాబు నన్ను బచ్చా అంటున్నాడు, నేను బచ్చానే అయితే 14 సంవత్సరాల తన పాలనలో చేసిన మంచిని చూపించి ఓటు అడగడం మానేసి నన్ను తిట్టడమే పనిగా ఎందుకు పెట్టుకుంటాడు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం అంబాజీపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నా పాలన చూసి ఎందుకు భయపడి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. తన పాలనలో ఒక్క మంచినైనా చంద్రబాబు చెప్పగలడా, నేను చెప్పగలను అన్నారు.