గోపాలపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 20వ తేదీన తాను నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సోడదాసి మార్టిన్ లూథర్ తెలిపారు. శనివారం ఉ. 10గం. లకు దేవరపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి గోపాలపురం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని 11: 30 గంటలకు నామినేషన్ సమర్పించనున్నట్లు వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు.