రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి గోపాలపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత అన్నారు. ఈ మేరకు మంగళవారం ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్ రాఘవాపురంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తన ఎమ్మెల్యేగా గెలిపించాలని సూచించారు.