ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు దుర్మరణం

3283చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు దుర్మరణం
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాల ప్రకారం.గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులారీని అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న గండేపల్లి ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్