జగన్ ప్రభుత్వమంటేనే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్: మేకా లక్ష్మణ మూర్తి

6593చూసినవారు
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళ పాటు అరాచక పాలన సాగించారని తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యకర్త మేకా లక్ష్మణ మూర్తి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కులస్తులపై దాడులు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన పాపం వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక డాక్టర్ సుధాకర్ ను ఈ ప్రభుత్వం అనేక వేధింపులు గురిచేయడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్