గుడ్ ఫ్రైడే, ఈస్టర్లను పురస్కరించుకుని కాకినాడ నగరంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బ్రదర్ రిక్కీ గూటం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ భానుగుడి సెంటర్ నుండి రెండు ఫర్ జీసస్ లో జెండా ఊపి ఏఐసీసీ అధ్యక్షుడు రిక్కీ గూటం, జోసఫ్ బిన్నీ, జ్యోతి కుమార్, స్టీఫెన్ ఆనంద్ తదితరులు ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రిక్కీ గూటం మాట్లాడారు.