ఆత్రేయపురం: వాడపల్లిలో వైభవంగా వెంకన్న సుప్రభాత సేవ

60చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిధిలోని వాడపల్లి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ శనివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, పండితులు మంత్రోచ్చారణల మధ్య స్వామి వారి మేలుకొలుపు సేవ జరిగింది. అనంతరం భక్తులకు దైవ దర్శనానికి అనుమతించారు. స్వామివారిని కనులారా వీక్షించేందుకు భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్