వాడపల్లి వెంకన్న దర్శనానికి తరలివచ్చిన భక్తులు

1048చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో స్వామివారి ఆలయ ప్రాంగణం హోరెత్తింది. ఏడు శనివారాల స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలమని భక్తులు భావిస్తారు. కోనసీమ తిరుమల గా భావించే వాడపల్లి వెంకటేశ్వరస్వామిని భక్తులు తమ ఇలవేల్పుగా భావిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్