కొవ్వూరు వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. లిటరరీ క్లబ్ కల్యాణ మండపంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పర్యటన, ఎన్నికలలో తలారి వెంకట్రావు నామినేషన్కు సంబంధించి నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలకు సంబంధించి వైసీపీ తిరుణాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సమావేశం రసాభాసగా మారింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.