ముప్పిడి సమక్షంలో వైసీపీలోకి చేరికలు
వైసిపి అరాచక పాలన తట్టుకోలేక ఎంతోమంది వైసిపి నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని కొవ్వూరు నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు శనివారం తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో పలువురు వైసిపి కార్యకర్తలు తేదేపా తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముప్పిడి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి విజయానికి కృషి చేయాలన్నారు.