కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి యువతి మృతి చెందింది. రాజమండ్రి శాటిలైట్ సిటీ ప్రాంతానికి చెందిన భార్గవి (26) ఒక బ్యాంకులో పనిచేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు తర్ఫీదు పొందుతోంది. ఈ క్రమంలో ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి తిరిగి రాలేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా గోదావరిలో ఎవరో దూకినట్లు సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం మృతదేహం కనిపించింది.