ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే దిశగా కార్యాచరణ: ప్రయాగ

80చూసినవారు
సనాతన ధర్మంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి, ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చే దిశగా కార్యాచరణ చేపడుతున్నామని వీ. హెచ్. పీ జిల్లా కార్యదర్శి ప్రయాగ నరసింహమూర్తి తెలిపారు. మామిడికుదురులో ఆదివారం హిందూ సమ్మేళనం సభ మండల శాఖ అధ్యక్షుడు కూనపరెడ్డి రాము అధ్యక్షతన జరిగింది. హిందువుల్లో చైతన్యం లోపించిందన్నారు. దేశభక్తి, దైవభక్తిని పెంపొందించడం వీ. హెచ్. పీ ప్రధాన లక్ష్యాలని చెప్పారు. సభలో పలువురు ప్రముఖులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్