ఫోన్ కు బానిసై విద్యార్థి ఆత్మహత్య

79చూసినవారు
ఫోన్ కు బానిసై విద్యార్థి ఆత్మహత్య
యానాం యూకేవీ నగర్ కు చెందిన ఆటో డ్రైవరు కుమారుడు(18) కాకినాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అక్కడ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. సామాజిక మాధ్యమాల్లో ఆమెను అనుసరిస్తూ సెల్ ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతూ చదువును అశ్రద్ధ చేసి మానసిక ఒత్తిడికి గురై ఉరి వేసుకున్నాడు. మంగళవారం అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించినట్లు యానాం ఎస్సై మురుగానందన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్