జిల్లా దాటి వెళ్లి పెన్షన్ అందించిన సిబ్బంది

56చూసినవారు
జిల్లా దాటి వెళ్లి పెన్షన్ అందించిన సిబ్బంది
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 9వ వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ కుమార్ కాకినాడ వెళ్లి పెన్షన్ అందజేశారు. 9, 12 వార్డులకు చెందిన ముగ్గురు లబ్ధిదారులు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సూరాయిచెరువు, బొండాయి కోడుతూము వెల్ఫేర్ సెక్రెటరీలతో కలిసి సతీష్ కాకినాడ ఆసుపత్రికి వెళ్లి బుధవారం పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్