నరసాపురం-నిడదవోలు రోడ్డులో వంతెనను ఢీకొన్న లారీ

61చూసినవారు
నరసాపురం-నిడదవోలు రోడ్డులో వంతెనను ఢీకొన్న లారీ
నరసాపురం -నిడదవోలు ప్రధాన రహదారిలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నెగ్గిపూడి పంచాయతీ పరిధిలోని శ్మశాన వాటిక వద్ద ఉన్న పాత వంతెన మార్జిన్ కనపడక ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఈ వంతెనను మరమ్మతులు చేయించాలని అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్