ప్రజలంతా వరద బాధితులకు అండగా నిలవాలి

80చూసినవారు
ప్రజలంతా వరద బాధితులకు అండగా నిలవాలి
ప్రజలంతా విజయవాడ వరద బాధితులకు అండగా నిలవాలని కాకినాడ సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణంలో శుక్రవారం ఆయన సీపీఐ నాయకులతో కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో సిపిఐ పార్టీ ముందంజలో ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్