వివాహిత మృతిపై డీఎస్పీ దర్యాప్తు

66చూసినవారు
వివాహిత మృతిపై డీఎస్పీ దర్యాప్తు
కాకినాడ జిల్లా పెద్దాపురంలో సురేఖ అనే వివాహిత అనుమానాస్పద మృతిపై సోమవారం సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తెలిపారు. సురేఖ ఉరి వేసుకున్నట్లుగా భర్త సతీష్ ఫిర్యాదు చేయగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో ఎస్ఐ మౌనిక, ఇతర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలది హత్య అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్