అయ్యారక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ

71చూసినవారు
అయ్యారక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన ఆవాల లక్ష్మీనారాయణ అయ్యారక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ శుక్రవారం రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులుగా 19 మందిని నియమించారు. అయ్యారక విభాగానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా సీనియర్ వైసీపీ నాయకుడు లక్ష్మీనారాయణ నియమించారు. గత వైసీపీ పాలనలో లక్ష్మీనారాయణ భార్య రాజేశ్వరి అయ్యారక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసారు.

సంబంధిత పోస్ట్