రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

83చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
సామర్లకోట కాకినాడ రోడ్ లో గుంతలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సామర్లకోట నుండి కాకినాడ వైపు బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి సామర్లకోట ముత్యాలమ్మ తల్లి ఆలయం సమీపాన రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గుంతలో పడడంతో తలకు తీవ్ర గాయమైంది. గాయపడిన వ్యక్తి పిఠాపురం మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన వారిగా పలువురు పేర్కొంటున్నారు. స్ధానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్