ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి

73చూసినవారు
ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి
ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలకు వరద ముంపు పొంచి ఉందని, అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పెద్దాపురం ఆర్డిఓ సీతారామారావు సూచించారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం రిజర్వాయర్ నుండి సుమారు 1500 క్యూసెక్కుల నీరును విడుదల చేసారని, ఎగువన కురుస్తున్న వర్షాలతో మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో గండ్లు పడే అవకాశం ఉందని, రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలనిబుధవారం ఆర్డిఓ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్