పిఠాపురం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే వర్మ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన సీఎం జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ ప్రచారం నిర్వహించారు. సజ్జల సలహా విని సీఎం జగన్ దాడి చేయించుకున్నారని, గులకరాళ్లు డబ్బాలోంచి కిందపడేస్తూ వినూత్నంగా విమర్శలు చేశారు. జగన్ ఇప్పుడు గులకరాయితో, రేపు ఇసుకతో కొట్టించుకుంటారన్నారు. తేలికపాటి రాయి పడితే ఎంత దెబ్బ తగులుతుందని ప్రశ్నించారు.