వ్యక్తిగత కారణాలతో గడ్డి మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురై కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న యువకుడు ఆదివారం రాత్రి మృతి చెందాడు. ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్లపూడికి చెందిన దుర్గాప్రసాద్(19) మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. గడ్డి మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన దుర్గా ప్రసాద్ ను కుటుంబ సభ్యులు ఆదివారం జీజీహెచ్ కు తీసుకువచ్చారని, కొద్దిసేపటికి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడన్నారు.